అహ్మదాబాద్ : గుజరాత్లోని కచ్ జిల్లాలో ఆదివారం భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 12.43 గంటలకు రిక్టర్ స్కేల్పై 3.9 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. కచ్ జిల్లాకు 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈశాన్య భచావులో భూమికి 14.2 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు నేషనల్ సిస్మోలజీ అధికారులు తెలిపారు. ప్రకంపనలతో నష్టం జరిగినట్లు ఎలాంటి నివేదిక అందలేదని పేర్కొన్నారు. ఇంతకు ముందు శనివారం మధ్యాహ్నం 12.02 గంటల సమయంలోనే రిక్టర్ స్కేల్పై 1.6తీవ్రతతో భూమి కంపించింది. భచావుకు శాన్యంగా 21 కిలోమీటర్ల దూరంలో భూపంక కేంద్రాన్ని గుర్తించినట్లు ఎన్సీఎస్ పేర్కొంది. గుజరాత్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ప్రకారం కచ్ జిల్లా అధిక భూపంక రిస్క్ జోన్లో ఉంది. 2001, జనవరిలో 6.9 తీవ్రతతో భూమి కంపించగా.. జిల్లాలో తీవ్ర నష్టం కలిగింది.