అహ్మదాబాద్ : గుజరాత్ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమ్మేలీ జిల్లాలోని బధాడా గ్రామంలో సోమవారం తెల్లవారు జామున 2.30 గంటల ప్రాంతంలో టక్కు గుడిసెలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎనిమిది మృత్యువాతపడ్డారు. మృతుల్లో 8-13 సంవత్సరాల మధ్య వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారని, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. క్రేన్ను తరలిస్తున్న సమయంలో ట్రక్కు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లిందని పేర్కొన్నారు. గుడిసెలో పది మంది నిద్రిస్తుండగా.. వారిపైకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ఎనిమిది మంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలకు గురవగా ఆసుప్రతికి తరలించినట్లు అమ్రేలి ఎస్పీ నిర్లిప్త్రాయ్ తెలిపారు. మృతుల్లో ఇద్దరు వృద్ధులు ఉన్నారని చెప్పారు.