న్యూఢిల్లీ, నవంబర్ 22: పని ప్రదేశాల్లో కరోనా వ్యాక్సినేషన్ శిబిరాలు నిర్వహించాలని రాష్ర్టాలకు కేంద్రం సూచించింది. వ్యాక్సిన్ వేయించుకొన్న ఉద్యోగులకు బ్యాడ్జిలు ఇవ్వాలని తెలిపింది. వాటిపై వ్యాక్సిన్ వేయించుకొనేలా ఇతరులను ప్రోత్సహించే సందేశాలు ఉండాలని పేర్కొంది. ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు గ్రామ, జిల్లాస్థాయిలో ప్రముఖులు, కమ్యూనిటీ నాయకుల సేవలను ఉపయోగించుకోవాలని సూచించింది.