హైదరాబాద్, మార్చి 15, (నమస్తే తెలంగాణ): గత ఆర్థిక సంవత్సరం 2020-21లో జీడీపీ కన్నా తెలంగాణ జీఎస్డీపీ రేటు ఎక్కువగా నమోదైనట్టు కాగ్ నివేదిక పేర్కొన్నది. ఇటీవలి కాలంలో దేశ ఆర్థిక వృద్ధిరేటు కన్నా తెలంగాణ వరుసగా అధిక వృద్ధి రేటును నమోదు చేస్తున్నదని కితాబు ఇచ్చింది. 2020-21లో జీడీపీ మైనస్ -2.97శాతం నమోదు కాగా, కొవిడ్ మహమ్మారి, ఇతర ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ తెలంగాణ 2.42 సానుకూల వృద్ధి రేటును నమోదు చేసినట్టు కాగ్ పేర్కొన్నది.