శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో క్రమక్రమంగా ప్రయాణీకుల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం జీఎంఆర్ కమ్యూనికేషన్ అధికార వర్గాలు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ పెరుగుతుండగా అదే క్రమంలో విమాన ప్రయాణాల డిమాండ్ పెరుగుతోంది. ఎయిర్పోర్టులో పరిశుభ్రత చర్యలు, భద్రతా ప్రమాణాలు, డిజిటలైజేషన్ తో ప్రయాణీకుల్లో విశ్వసనీయత పెరుగుతుంది.
గత జూన్ 1న కేవలం 100 విమానాలు రాకపోకలు జరగగా, జూలై 25 నాటికి 288 కి పెరిగింది. నెల మొత్తంలో 8000 వేల కంటే ఎక్కువే విమానాలు రాకపోకలు సాగించాయి. జూన్ 1న కేవలం 10 వేల ప్రయాణీకుల నుంచి జూలై 18న ఒకేరోజు 29 వేలు దాటింది. అదే నెలలో 6.8 లక్షల మంది దేశీయ, 50,000 మంది ఇంటర్నేషనల్ ప్రయాణీకులు రాకపోకలు చేశారు. ఇటీవల శ్రీనగర్కు కొత్త గా విమానాలు నడుస్తుండగా రెండు రోజుల కిందట మాలె కు పునఃప్రారంభమయ్యాయి.