హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) అభ్యర్థుల సందేహాల నివృత్తికి వెబ్సైట్లోనే ప్రత్యేకంగా గ్రీవెన్స్ ఆప్షన్ను తీసుకొచ్చింది. ‘రైజ్ ఏ గ్రీవెన్స్’ పేరుతో ఓ ఆప్షన్ను ఏర్పాటుచేసింది. అభ్యర్థులు ఎటువంటి సమస్యనైనా ఆన్లైన్లోనే ఫిర్యాదు చేస్తే సరిపోతుంది. ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను డాక్యుమెంట్ రూపంలోనూ అప్లోడ్ చేయవచ్చు. పరీక్షల ఫలితాలు, వెబ్ ఆప్షన్, సెలక్షన్ ప్రొసీజర్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, కోర్టు ఉత్తర్వుల అమలు, డిపార్ట్మెంటల్ పరీక్షలు, కొత్త ప్రకటనల జారీ తదితర అన్ని సమస్యలకు ఇకపై ఆన్లైన్లోనే ఫిర్యాదు చేసుకోవచ్చు.