లండన్ : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్( టాక్) మహిళా నాయకురాలు శుష్మున రెడ్డి జన్మదినం సందర్భంగా మొక్కను నాటారు. ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ఛాలెంజ్ మేరకు.. రీడింగ్ నగరంలోని తన నివాసంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించి మొక్కను నాటారు.
తన మిత్రులకు, శ్రేయోభిలాషులను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ తలపెట్టిన ఇంత గొప్ప కార్యక్రమంలో భాగస్వాములైనందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రకృతి పట్ల ఎంపీ సంతోష్ కుమార్ చొరవ చాలా గొప్పదని ఆమె ప్రశంసిచారు.