వరంగల్ : గ్రామ పంచాయతీలు కేవలం పన్నుల మీద, ప్రభుత్వాలు ఇచ్చే నిధుల కోసం ఎదురు చూడకుండా, స్వంతంత్రంగాఎదిగే విధంగా ఆలోచించాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంగళవారం రాయపర్తి మండల కేంద్రంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన ఆర్టీసీ బస్ స్టాండ్లోని షాపింగ్ కాంప్లెక్స్ ని ఆయన ప్రారంభించారు.
గ్రామ పంచాయతీ నిధులు, 14వ ఫైనాన్స్ కమిషన్ నిధులతో షాపింగ్ కాంప్లెక్స్ ని నిర్మించిన గ్రామ పంచాయతీ సిబ్బందిని అభినందించారు.ఈ షాపింగ్ కాంప్లెక్స్ తో పర్మినెంట్ ఆదాయ మార్గం ఏర్పడటమే కాకుండా, బస్ స్టాండ్ కి అందం ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు, గ్రామ పంచాయతీ సర్పంచ్, సభ్యులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.