న్యూఢిల్లీ : దేశంలో మోడెర్నా వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చురుగ్గా పని చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. వ్యాక్సిన్కు గత నెలలో అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్కు అత్యవసర వినియోగ అధికారం ఉందని, దేశంలో ఎలా అందుబాటులోకి ఉంచాలి? దిగుమతికి ప్రభుత్వం కంపెనీదారుతో కలిసి పని చేస్తుందని నీతి ఆయోగ్ సభ్యుడు (హెల్త్) వీకే పాల్ తెలిపారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. జైడస్ క్యాడిలా మూడో దశ ట్రయల్స్ ఫలితాలను డీసీజీఐకి గతవారం సమర్పించినట్లు చెప్పారు. శాస్త్రీయ ఆధారాలను నిపుణులు పరిశీలిస్తున్నారని, సమాచార మార్పిడి చురుగ్గా సాగుతోందన్నారు. ట్రయల్స్ ఫలితాల విశ్లేషణ అనంతరం టీకా వినియోగానికి సిఫారసు చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యాక్సిన్పై డీసీజీఐలోని శాస్త్రీయ వ్యవస్థ నిర్ణయం తీసుకునే వరకు వేచి ఉండాలన్నారు.