ములుగు, జనవరి 24 : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మేడారంలో పలు అభివృద్ధి పనులను ఎంపీ కవిత, జడ్పీచైర్మన్ జగదీశ్వర్తో కలిసి సోమవారం ప్రారంభించారు. జాతర ఏర్పాట్లకు ప్రభుత్వం రూ.75 కోట్లను కేటాయించిందని, కోటి మందికిపైగా వచ్చే భక్తులకు అసౌకర్యంలేకుండా చర్యలు చేపట్టామని చెప్పారు.