చదువుకున్న బడికి ఏదో ఒక ప్రత్యేకత ఉండాలనుకొన్నారాయన.. ఆలోచన వచ్చినదే తడవుగా పాఠశాల భవనం పైభాగాన్ని ఎర్రకోటలా మార్చేశారు.. ఇటీవల స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా అక్కడే జెండాను కూడా ఎగురవేశారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం పిడిచెడ్కు చెందిన పంగ మల్లేశం. ప్రస్తుతం జడ్పీటీసీగా పనిచేస్తున్న ఆయన.. రాజస్థాన్ కళాకారులను పిలిపించి ఎర్రకోటను ప్రతిబింబించేలా నిర్మాణాన్ని తయారుచేయించారు. విద్యార్థుల్లో దేశభక్తికి పెంపొందించేందుకే ఈ నిర్మాణాన్ని చేపట్టినట్టు మల్లేశం పేర్కొన్నారు.
– గజ్వేల్