రామచంద్రాపురం, డిసెంబర్ 5: పేదల వైద్యానికి ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదని శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం ఆర్సీపురం లక్ష్మీగార్డెన్స్లో లబ్ధిదారులు బాలయ్యకు రూ.60 వేలు, లక్ష్మీబాయికి రూ.16 వేలు, వేణుగోపాల్రెడ్డికి రూ.40 వేలు, వెంకట్రామ్రెడ్డికి రూ.32 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ప్రొటెం చైర్మన్ మాట్లాడుతూ పేదలు కార్పొరేట్ దవాఖానలో మెరుగైన వైద్యం చేయించుకునేందుకు సీఎంఆర్ఎఫ్ బాసటగా నిలుస్తున్నదన్నారు. పేదల ఆరోగ్యం కోసం ప్రభుత్వం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నదన్నారు. ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేస్తూ ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నదన్నారు. ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం కోసం మల్టిస్పెషాలిటీ దవాఖానను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్పొరేట్ దవాఖానలో పేదలు చికిత్స చేయించుకోవడానికి సీఎంఆర్ఎఫ్ పథకం దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ ప్రమోద్గౌడ్, గ్రంథాలయ డైరెక్టర్ కుమార్గౌడ్, ఆదర్శ్రెడ్డి, దేవేంద్రాచారి, భాస్కర్, పాపయ్య యాదవ్, లింగయ్య, సంపత్ పాల్గొన్నారు.
కాలనీ ప్రజలకు అండగా ఉండాలి
రామచంద్రాపురం, డిసెంబర్ 5 : కాలనీ ప్రజలకు నిత్యం అండగా ఉండి సేవలు అందించాలని ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి కాలనీ అసోసియేషన్ సభ్యులకు సూచించారు. మయూరినగర్ కాలనీ నూతన కార్యవర్గం ఇటీవల ఎన్నికైన సందర్భంగా కాలనీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, కార్పొరేటర్ పుష్పానగేశ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కాలనీ నూతన కార్యవర్గ సభ్యులను ప్రముఖులు సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్సీపురం అభివృద్ధికి కృషిచేస్తానని తెలిపారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు ఇంద్రేశం రాజు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు గోవింద్, ఆదర్శ్రెడ్డి, కుమార్గౌడ్, బేకు యాదయ్య, మల్లేశ్, దేవేందర్యాదవ్, విఠల్రెడ్డి, మహిపాల్రెడ్డి, ప్రమోద్గౌడ్ పాల్గొన్నారు.