చెన్నై: ఆఫీసు వేళల్లో ప్రభుత్వ ఉద్యోగులు వ్యక్తిగత అవసరాలకు ఫోన్లను వాడేందుకు అనుమతించొద్దని మద్రాస్ హైకోర్టు చెప్పింది. ఈ మేరకు మార్గదర్శకాలు రూపొందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని న్యాయమూర్తి జస్టిస్ సుబ్రమణియం ఆదేశించారు. అలాగే నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని సూచించింది. అత్యవసర కాల్స్ వస్తే మాట్లాడేందుకు పై అధికారి అనుమతితో బయటకు వెళ్లి మాట్లాడి రావాలని చెప్పింది. ఫోన్లను స్విచ్ ఆఫ్ లేదా సైలెంట్ మోడ్లో పెట్టాలని పేర్కొంది. పని వేళల్లో కూడా మొబైల్ ఫోన్ను ప్రభుత్వ ఉద్యోగులు వాడుతున్నారని ఉద్యోగుల పనితీరుపై కూడా ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.