హైదరాబాద్ : మంత్రుల శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకులభరణం కృష్ణమోహన్ రావు, హైదరాబాద్లోని మంత్రుల సముదాయంలో స్వార్ మహతి కళా పరిషత్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 25 – 2022 న రవీంద్రభారతిలో నిర్వహిస్తున్న ‘సృజనోత్సవ్ – 2022’ లోగోను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రాచీన కళలను పరిరక్షణకు కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణ కు చెందిన సంస్కృతి, సంప్రదాయాలను, కళలను ప్రోత్సాహిస్తున్నామన్నారు.
సృజనోత్సవ్ పేరిట విద్యార్థులకు కళల పట్ల అవగాహన కల్పించేందుకు మ్యూజిక్, చిత్రలేఖనం పై పోటీలు నిర్వహించి వారిని ప్రోత్సాహిస్తున్నందుకు స్వార్ మహతి కళా పరిషత్ ను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో డా. ఆదిత్య కుమార్, మహేష్, వట్టికూటి రామారావు గౌడ్ లు పాల్గొన్నారు.