జైపూర్: రాజస్థాన్లోని జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఓ ప్రయాణికుడి వద్ద సుమారు 769.5 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ బంగారం విలువ సుమారు 41 లక్షలు ఉంటుంది. వైద్య పరీక్షలు చేసిన తర్వాతే ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి ఎయిర్ అరేబియా ఫ్లయిట్ ద్వారా ఆ ప్రయాణికుడు వచ్చాడు. అనుమానం రావడంతో అతన్ని చెక్ చేశారు. ఎన్ని ప్రశ్నలు అడిగినా అతనేమీ చెప్పలేదు. దీంతో అధికారులు అతన్ని సోదా చేశారు. కానీ మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఆ ప్రయాణికుడి మలద్వారం నుంచి మూడు క్యాప్సుల్స్ను రికవర్ చేశారు. సీటీ స్కాన్ నిర్వహించిన తర్వాత అతని వద్ద ఆ బంగారు క్యాప్సుల్స్ ఉన్నట్లు గుర్తించారు. మూడు క్యాప్సుల్స్లో పసుపు రంగు గుళికలు ఉన్నాయి. పాలీథీన్ టేపుతో ఆ క్యాప్సుల్స్ను చుట్టి ఉంచారు. నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేపడుతున్నారు.