న్యూఢిల్లీ: దేశంలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.208 పెరిగి రూ.44,768కి చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 44,976 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో విలువైన లోహల ధరలు స్వల్పంగా తగ్గడంతోనే దేశీయంగా కూడా బంగారం ధరలు తగ్గాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
అదేవిధంగా వెండి ధరలు కూడా ఇవాళ స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.602 తగ్గి రూ.68,194కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.67,592 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,730 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 26.68 అమెరికన్ డాలర్లు పలికింది.