సిద్దిపేట : ఈ నెల 25న నిజాంసాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలను విడుదల చేయనున్నట్లు ఇరిగేషన్ గజ్వేల్ ఏరియా ఎస్ఈ వేణు తెలిపారు. బుధవారం గజ్వేల్- ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ ఊరచెరువు మినీట్యాంక్బండ్ , రాజిరెడ్డి పర్మికుంట, గజ్వేల్ పాండవుల చెరువు మినీట్యాంక్బండ్, నాచారం హల్దీవాగు చెక్డ్యాం, నాచారం పెద్దచెరువు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నీటి విడుదల నేపథ్యంలో నాచారం లక్ష్మీనరసింహ్మ స్వామి దేవస్థాన ప్రాంగణంలోని హల్దీవాగుపై నిర్మిస్తున్న చెక్డ్యాం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి అధికారులను ఆదేశించారు.