పనాజీ : గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం పట్ల సీఎం ప్రమోద్ సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ ప్రచారం కోసం తాను రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ సొంత నియోజకవర్గంపై పెద్దగా దృష్టి సారించలేకపోయానని చెప్పారు. తన తరపున పార్టీ కార్యకర్తలు ప్రచారం చేపట్టారని తాను స్వల్ప తేడాతో గెలుపొందానని అన్నారు.
తాను తక్కువ మెజారిటీతో బయటపడినా పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించడం గొప్ప విషయమని వ్యాఖ్యానించారు. తమకు 20 స్ధానాలు లభించాయని, మరో ముగ్గరు బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చారని చెప్పారు. 40 స్ధానాలున్న గోవాలో బీజేపీ 20 స్ధానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 11 స్ధానాల్లో, ఆప్ 2, టీఎంసీ 2, ఇతరులు 5 స్ధానాల్లో ముందంజలో ఉన్నారు.