హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): బాసర పుణ్యక్షేత్రంలో మరో సరస్వతి విగ్రహాన్ని చారిత్రక పరిశోధకులు గుర్తించారు. పాపహరేశ్వర దేవాలయం గర్భగుడి లో ఇంతకాలం పార్వతీదేవిగా పూజలు అం దుకొంటున్న విగ్రహం కూడా సరస్వతిదేనని ఆధారాలతో సహా తెలంగాణ చరిత్ర పరిశోధక బృందం సభ్యుడు, బాసరవాసి బలగం రాంమోహన్ (ఉపాధ్యాయుడు) వెల్లడించా రు. ఆసనభేదాన్ని బట్టి జైనధర్మ ప్రతిమ కావొచ్చని అభిప్రాయపడ్డారు. బాసరలో శిథిలావస్థలో ఉన్న పాపహరేశ్వరాలయంలో లభించి న శిల్పాలు జైనమతానికి సంబంధించినవే ఎక్కువ అని చెప్పారు.