బ్యాంకాక్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య 60 లక్షలు దాటింది. కొన్ని దేశాలు కరోనా ఆంక్షలు తొలగిస్తున్నా.. మరికొన్ని దేశాలు మాత్రం ఇంకా నియమావళిని పాటిస్తున్నాయి. మరణాల్లో కొత్త మైలురాయి నమోదు అయినట్లు హాప్కిన్స్ వర్సిటీ తెలిపింది. గడిచిన నాలుగు నెలల్లో పది లక్షల మంది కోవిడ్ వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు జాన్స్ హాప్కిన్స్ వర్సిటీ పేర్కొన్నది. కరోనా వైరస్ గత మూడేళ్ల నుంచి జనాన్ని పట్టిపీడిస్తున్న విషయం తెలిసిందే.