అనారోగ్యంతో కన్నుమూసిన సినీ నటుడు, నిర్మాత ఘట్టమనేని రమేష్బాబు అంత్యక్రియలు ఆదివారం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో పూర్తయ్యాయి. అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని తొలుత ఫిలింనగర్లోని పద్మాలయ స్టూడియోకు తరలించారు. కృష్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, పలువురు సినీ రాజకీయ ప్రముఖులు రమేష్బాబు భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
కుమారుడి పార్థివదేహాన్ని చూసి కృష్ణ కన్నీటిపర్యంతమయ్యారు. కరోనా బారిన పడి హోమ్ ఐసోలేషన్లో ఉన్న మహేష్బాబు తన సోదరుడి అంత్యక్రియలకు హాజరుకాలేకపోయారు. అన్నయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారాయన. ‘నువ్వే నాకు స్ఫూర్తి, బలం, ధైర్యం. ఈ జన్మలోనే కాదు ఎన్ని జన్మలైనా నువ్వు నా అన్నయ్యగా ఉండాలని కోరుకుంటున్నా. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’ అని మహేష్బాబు భావోద్వేగానికి లోనయ్యారు. రమేష్బాబు చితికి ఆయన కుమారుడు నిప్పంటించారు.