నిజామాబాద్ స్పోర్ట్స్: ఈజిప్టుతో స్నేహపూర్వక మ్యాచ్ల కోసం ఎంపిక చేసిన భారత సీనియర్ మహిళల జట్టులో తెలంగాణ యువ ఫుట్బాలర్ గుగులోతు సౌమ్య చోటు దక్కించుకుంది. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న సౌమ్య..ఈనెల 5, 8 తేదీల్లో ఈజిప్టుతో జరిగే మ్యాచ్ల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. ఈజిప్టు పర్యటన కోసం టీమ్ఇండియా ఆదివారం బయల్దేరి వెళ్లనుంది. గాయం కారణంగా ప్రతిష్ఠాత్మక ఏఎఫ్సీ ఆసియా టోర్నీకి దూరమైన సౌమ్య..దాదాపు రెండు నెలల పాటు జాతీయ జట్టుకు దూరమైది. స్థానిక లీగ్లలో సత్తాచాటడం ద్వారా ఈ ఇందూరు యువ ప్లేయర్ తిరిగి జట్టులో చోటు దక్కించుకుందని రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్(టీఎఫ్ఏ) కార్యదర్శి ఫాల్గుణ, కేర్ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్ పేర్కొన్నారు.