న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్కు ఐఎస్ఐఎస్ కశ్మీర్ నుంచి రెండు బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చాయి. దీంతో ఢిల్లీలోని ఆయన ఇంటి వద్ద పోలీసులు భద్రతను పెంచారు. గంభీర్ను ఆయన కుటుంబ సభ్యులను చంపుతామంటూ ఐఎస్ఐఎస్ కశ్మీర్ సంస్థ నుంచి మంగళవారం రాత్రి తొలి మెయిల్ వచ్చింది. అనంతరం బుధవారం మరో మెయిల్ వచ్చింది. ‘నిన్ను చంపాలనుకున్నాం. నిన్న బతికిపోయావ్. బతుకుమీద ఆశ ఉంటే రాజకీయాలను, కశ్మీర్ అంశాన్ని వదిలెయ్’ అని మెయిల్లో బెదిరించారు. గంభీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.