వనపర్తి, నవంబర్ 1(నమస్తే తెలంగాణ): త్వరలో 25 వేల మంది రైతులతో వనపర్తి జిల్లాకేంద్రంలో అన్నదాతల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. సోమవారం ‘అన్నదాతలతో ఆత్మీయ సమ్మేళనం’ పేరుతో వనపర్తి నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల్లో 41 రైతు వేదికల్లో సమావేశాలు ఏర్పాటుచేశారు. గోపాలపేట మండలంలో జరిగిన సమ్మేళనంలో నిరంజన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సంప్రదాయ పంటల సాగు నుంచి రైతులు బయటకు వచ్చి, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను పండించాలని సూచించారు. ఆహార పంటలతోపాటు ఉద్యానవన పంటల సాగుకు రైతులు ఉద్యుక్తులు కావాలని పిలుపునిచ్చారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇచ్చే పండ్లతోటలు, ఆయిల్పామ్, నూనె గింజల సాగుపై దృష్టిసారించాలని కోరారు. రైతులు ఆర్థికంగా స్థిరత్వం సాధించి బలపడితేనే వారి చుట్టూ ఉన్న వ్యవస్థలు బలపడుతాయని పేర్కొన్నారు.
సాంకేతికత సాయంతో అవగాహన
రైతు వేదికల్లో డిజిటల్ స్క్రీన్ల ద్వారా రైతులకు వ్యవసాయ సమాచారం అందించేవిధంగా చర్య లు తీసుకుంటామని మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అన్నదాతలకు విజ్ఞానం అందించేందుకు కృషి చేస్తామని చెప్పా రు. మార్కెటింగ్ నెట్వర్క్ను వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసేలా చర్యలు చేపడుతామ ని ఉద్ఘాటించారు. ఆత్మీయ సమ్మేళనాల్లో వచ్చిన సూచనలు, సలహాలతో ముందు కు సాగుతామని అన్నారు. రైతు ఉన్న స్థితి నుంచి ఉన్నతం గా ఎదగాలంటే ఏంచేయాలో చర్చ జరుగాలని ఆకాంక్షించారు. రైతు బతికితేనే రాజ్యం బతుకుతుందని చెప్పారు. తెలంగాణకు ముందు, ఆతర్వాత అన్నదాతల స్థితిని బేరీజు వేసుకోవాలని సూచించారు. రైతు రాజ్యంగా, రైతు రాష్ట్రంగా తెలంగాణ నిలువాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని వెల్లడించారు. వ్యవసాయానికి, వ్యవసాయదారులకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం, పథకాలు దేశంలో ఎక్కడా, ఎవరూ ఇవ్వడం లేదని మంత్రి స్పష్టంచేశారు.