రాధిక శరత్ కుమార్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ ‘గాలివాన’. బీబీసీ స్టూడియోస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ భాగస్వామ్యంతో జీ5 ఓటీటీ ఈ వెబ్ సిరీస్ ను రూపొందిస్తోంది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ఆన్లొకేషన్ లో సమావేశం నిర్వహించారు. ఇప్పటిదాకా ఏ భాషలోనూ వెబ్ సిరీస్లో నటించలేదని, కథ బాగా నచ్చడంతో తెలుగులో ‘గాలివాన’ చేసేందుకు ఒప్పుకున్నానని, క్రైమ్ థ్రిల్లర్గా ఆకట్టుకుంటుందని అన్నారు రాధిక శరత్ కుమార్. ఈ వెబ్ సిరీస్ తో రాధికతో నటించాలనే కోరిక తీరిందన్నారు నటుడు సాయికుమార్. కార్యక్రమంలో నిర్మాత శరత్ మరార్, దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి పాల్గొన్నారు.