రిలయన్స్ డీల్ ఆమోదం కోసం
న్యూఢిల్లీ, మార్చి 19: కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ ఏప్రిల్ 20,21 తేదీల్లో షేర్హోల్డర్లు, రుణ దాతల సమావేశాల్ని ఏర్పాటు చేసింది. రిలయన్స్ రిటైల్తో కుదుర్చుకున్న రూ. 24,713 కోట్ల లావాదేవీకి అనుమతి కోరుతూ ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు శనివారం స్టాక్ ఎక్సేంజీలకు ఫ్యూచర్ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలు తెలిపాయి. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముంబై బెంచ్ ఫిబ్రవరి 28న జారీచేసిన ఉత్తర్వుల మేరకు షేర్హోల్డర్లు, రుణదాతల సమావేశాల్ని ఫ్యూచర్ జరుపుతున్నది. ఫ్యూచర్ గ్రూప్ తన రిటైల్, హోల్సేల్, లాజిస్టిక్స్ వ్యాపారాన్ని రిలయన్స్కు విక్రయించేందుకు 2020 ఆగస్టులో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. వివిధ కారణాలతో ఆ లావాదేవీ ఇప్పటివరకూ పూర్తికాలేదు.