నగరంలో ప్రతి ఇంటికి ఉచితంగా నెలకు 20వేల లీటర్ల వరకు మంచి
నీటిని సరఫరా చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంలో మీరు లబ్ధిదారులుగా లేరా? మీ క్యాన్ (కన్జ్యూమర్ అకౌంట్ నంబర్)తో ఆధార్ నంబరు అనుసంధానం ఇంకా కాలేదా? అటువంటి వారికి జలమండలి ఈ నెల 31 వరకు గడువిచ్చింది. ఆ లోగా ఈ అవకాశాన్ని వినియోగించుకున్న వారందరికీ రూపాయి కూడా కట్టే అవసరం లేకుండా… జీరో వాటర్ బిల్లులు రానున్నాయి. ఉచిత మంచినీటి పథకంలో లబ్ధిదారులుగా నమోదు చేసుకోని వారికి మాత్రం వచ్చే జనవరిలో పాత బకాయిలతో సహా బిల్లులు జారీ కానున్నాయి.
ఈ మేరకు జలమండలి ఎం.డి. దానకిశోర్ గురువారం సమీక్ష నిర్వహించారు. నగరంలోని ప్రతి ఇల్లు, ప్రతి ఫ్లాట్ వినియోగదారులు నెలకు 20వేల లీటర్ల వరకు ఉచితంగా మంచినీటిని పొందేందుకు అర్హులని చెప్పారు. ఆధార్- క్యాన్ అనుసంధానం చేసుకోని వినియోగదారులు ఇంకా 4.3 లక్షల మంది ఉన్నారని వారందరికీ నెలాఖరు వరకు అవకాశం ఇస్తున్నట్లు వెల్లడించారు. 2020 డిసెంబరు నుంచి ఇప్పటివరకు మంచినీటి బిల్లులు జారీ చేయలేదని చెప్పారు. కింద నమోదైన వారందరికీ గత 13 నెలలకు సంబంధించి జీరో వాటర్ బిల్లు ఇస్తామని తెలిపారు. మిగతావారు బకాయిలు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు.
క్యాన్-ఆధార్ అనుసంధానం చేసుకున్న వారికే వర్తింపు ఈ 31 వరకు చేసుకోవచ్చు
సిటీబ్యూరో, డిసెంబర్16(నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు ఉచితంగా తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత మంచినీటి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జలమండలి ఎండీ దానకిశోర్ పేరొన్నారు. గురువారం ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈసందర్భంగా దానకిశోర్ మాట్లాడుతూ… డొమెస్టిక్ – స్లమ్, డొమెస్టిక్ – వ్యక్తిగత గృహాలు, మల్టీస్టోర్డ్ బిల్డింగ్(ఎంఎస్బీ), గేటెడ్ కమ్యూనిటీ కేటగిరీల కింద ప్రతి గృహ వినియోగదారుడు అర్హుడేనని పేరొన్నారు. ఈ పథకం కోసం నమోదు చేసుకున్న ప్రతి ఇల్లు, ఫ్లాట్, యూనిట్ వినియోగదారులు నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా మంచినీటిని పొందవచ్చని తెలిపారు.
ఉచిత మంచినీటి పథకానికి ఈ నెల 31 వరకు గడువు ఉన్నప్పటికీ ఆ తర్వాత కూడా నమోదు చేసుకునే అవకాశం ఇస్తున్నట్టు దానకిశోర్ వెల్లడించారు. అయితే అలా నమోదు చేసుకున్నవారు పథకంలో చేరిన నాటి నుంచి మాత్రమే 20వేల లీటర్లు ఉచితంగా పొందేందుకు అర్హులవుతారని, అప్పటి వరకు బిల్లులు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. మరో 4.3 లక్షల మంది వినియోగదారులు ఈ పథకం కింద నమోదు చేసుకోవాల్సి ఉన్నదని చెప్పారు. ఆ లోగా సుమారు 60వేల మంది వినియోగదారులు ఈ పథకాన్ని నమోదు చేసుకునే అవకాశం ఉందని, వీరితో కలిపి మొత్తం 5.5లక్షల(56శాతం) వినియోగదారులు ఈ పథకాన్ని పొందుతారని అంచనా వేస్తున్నామన్నారు.
ఉచిత నీటి పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వివిధ మాధ్యమాల ద్వారా విసృ్తతంగా ప్రచారం చేస్తున్నామని దానకిశోర్ చెప్పా రు. స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో వార్డుస్థాయి సమావేశాలు కూడా ఏర్పాటుచేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటింటికీ జలమండలి సిబ్బంది వెళ్లి ఆధార్ అనుసంధానం చేసే ప్రక్రియను కూడా చేస్తున్నారని వివరించారు. ఈ పథకానికి సంబంధించి వినియోగదారులకు ఎటువంటి సందేహాలు ఉన్నా 155313 నెంబరుకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, ఆపరేషన్ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, స్వామి, సీజీఎంలు, జీఎంలు,
మంచినీటిని ఉచితంగానే సరఫరా చేస్తామంటూ.. గత ఏడాది జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని రాష్ట ప్రభుత్వం 2020 డిసెంబరు నుంచి అమలు చేస్తున్నది. ఈ పథకం కింద లబ్ధిదారులుగా చేరేలా క్యాన్ (కన్స్యూమర్ అకౌంట్ నంబర్)తో ఆధార్ను అనుసంధానం చేసేందుకు పలుమార్లు జలమండలి గడువు పొడిగిస్తూ వచ్చింది. వినియోగదారులందరూ లబ్ధిదారులుగా చేరేందుకు వీలుగా 2020 డిసెంబరు నుంచి ఇప్పటి వరకు 13 నెలల బిల్లులు జారీ చేయలేదు.
కాగా, 2021 డిసెంబరు 31 వరకు నమోదు చేసుకున్న వారందరికీ జీరో వాటర్ బిల్లులు అందించనున్నారు. వీరు గత 13 నెలల బిల్లులు కట్టాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ నెలాఖరులోగా పథకంలో నమోదు చేసుకోని వారికి మాత్రం 2020 డిసెంబరు నుంచి పాత బిల్లులన్నీ జారీ చేస్తామని, వీరికి ఎటువంటి రాయితీలు ఉండవని ఎండీ దానకిశోర్ స్పష్టం చేశారు. బకాయిలు 4 వాయిదాల్లో చెల్లించే వెసులుబాటును ఇస్తున్నామని, వాటిపై మాత్రం పెనాల్టీ, వడ్డీ విధించబోమని చెప్పారు.