అమీర్పేట్, అక్టోబర్ 17: ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం (పీఎంకేవీవై) కింద యువతకు బ్లడ్ శాంపిల్ కలెక్షన్ టెక్నీషియన్ (ప్లిబొటొమి) కోర్సులో నాలుగు నెలలపాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్టు సొసైటీ ఫర్ ఎకనమిక్ డెవలప్మెంట్ (ఎస్ఈడీ) ప్రకటించింది. ఇంటర్లో బైపీసీ, ఎంపీహెచ్డబ్ల్యూ, ఎమ్మెల్టీ, డిఎంఎల్టీ, బీఎస్సీ, బీఎస్సీ నర్సింగ్ చేసి 18 నుంచి 30 ఏండ్ల వయసున్న అభ్యర్థులు ఈ కోర్సులో చేరేందుకు అర్హులని స్పష్టం చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 22లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. శిక్షణ సమయంలో అభ్యర్థులకు రోజూ రూ.125 చొప్పున ైస్టెపెండ్ లభిస్తుందని, మూడు నెలలపాటు ఇంటర్న్షిప్ ఉంటుందని తెలిపింది.