వారణాసి: భారత మాజీ క్రికెటర్లు శనివారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలోని కాశీ విశ్వనాథుని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కాశీ విశ్వేశ్వర ఆలయంలోని శివ లింగానికి మాల శివుడికి వందనం సమర్పించుకున్నారు.
సచిన్ టెండూల్కర్తోపాటు కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకున్న మాజీ క్రికెటర్లలో సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, బీసీసీఐ కార్యదర్శి జయ్ షా, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఉన్నారు. సచిన్తోపాటు వారంతా కూడా ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ విషయాన్ని ఆలయ ప్రజా సంబంధాల అధికారి మీడియాకు వెల్లడించారు.
#WATCH | Uttar Pradesh: Former Indian cricketers Sachin Tendulkar Sunil Gavaskar and Kapil Dev, BCCI Secretary Jay Shah, Rajeev Shukla, BCCI Vice-President, offered prayers at Kashi Vishwanath temple in Varanasi
(Video source – PRO Vishwanath Temple) pic.twitter.com/pWc1qWmOqR
— ANI (@ANI) September 23, 2023