తెలంగాణ భావన (1948-1970)
1. తెలంగాణలో వలస పాలనకు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
ఎ. 1324లో కాకతీయ రాజు రెండో ప్రతాప రుద్రుడిని ఢిల్లీ సుల్తాన్ మహ్మద్బిన్ తుగ్లక్ జయించడంతో తెలంగాణ ప్రాంతంలో వలస పాలన ప్రారంభమైంది
బి. 1687లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు గోల్కొండను జయించడంతో తెలంగాణలో వలస పాలన ప్రారంభమైంది
సి. 1724లో అసఫ్జాహీల రాకతో తెలంగాణలో వలస పాలన ప్రారంభమైంది
సరైన జవాబును గుర్తించండి?
1) ఎ 2) బి 3) సి 4) ఏదీకాదు
2. తెలంగాణ ప్రాంతంలో కాకతీయుల పాలన ఎంత కాలం కొనసాగింది?
1) సుమారు 400 సంవత్సరాలు
2) సుమారు 300 సంవత్సరాలు
3) సుమారు 100 సంవత్సరాలు
4) సుమారు 200 సంవత్సరాలు
3. తెలంగాణను పాలించిన వంశాలకు సంబంధించి కింది వాటిని జతపరచండి.
వంశం పాలనా కాలం
1. కాకతీయులు ఎ. క్రీ.శ. 1000-1323
2. కుతుబ్షాహీలు బి. క్రీ.శ 1518-1687
3. అసఫ్జాహీలు సి. క్రీ.శ. 1724-1948
4. మొఘలులు డి. క్రీ.శ. 1687-1724
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4. అసఫ్జాహీల కాలంలో 1885 వరకు తెలంగాణలో అధికార భాష?
1) ఉర్దూ 2) హిందీ
3) పర్షియా 4) అరబ్బీ
5. నిజాం ఉల్ ముల్క్కు ‘అసఫ్ జా’ అనే బిరుదు ఇచ్చిన మొఘల్ చక్రవర్తి?
1) మహ్మద్ షా 2) ఔరంగజేబు
3) షాజహాన్ 4) బాబర్
6. కింది వాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి.
1) గోల్కొండను రాజధానిగా చేసుకొని
నిజాం ఉల్ ముల్క్ దక్కన్ ప్రాంతాన్ని
పాలించాడు
2) ఔరంగాబాద్ను రాజధానిగా చేసుకొని
నిజాం ఉల్ ముల్క్ దక్కన్ ప్రాంతాన్ని
పాలించాడు
3) దోమకొండను రాజధానిగా చేసుకొని నిజాం ఉల్ ముల్క్ దక్కన్ ప్రాంతాన్ని పాలించాడు
4) పైవేవీ కావు
7. ఏ సంవత్సరం నుంచి నిజాం ఉల్ ముల్క్ దక్కన్ ప్రాంతాన్ని స్వతంత్రంగా పాలించాడు?
1) 1624 2) 1824
3) 1724 4) 1734
8. జతపరచండి. పాలకుడు పాలనా కాలం
1. నిజాం ఉల్ ముల్క్ ఎ. 1803-1829
2. నిజాం అలీఖాన్ బి. 1724-1748
3. సికిందర్ జా సి. 1761-1803
4. నసీరుద్దౌలా డి. 1829-1857
1) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
9. సరైన వ్యాఖ్యను గుర్తించండి.
1) వహాబీ ఉద్యమం ముస్లిం సానుకూల ఉద్యమం
2) వహాబీ ఉద్యమం బ్రిటిష్ సానుకూల ఉద్యమం
3) వహాబీ ఉద్యమం ముస్లిం వ్యతిరేక ఉద్యమం
4) వహాబీ ఉద్యమం బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం
10. సాలార్ జంగ్ బిరుదుతో దివాన్ పదవిని అలంకరించినవారు?
1) గులాంఖాన్ 2) మీర్ తురాబ్ అలీఖాన్
3) సిరాజ్-ఉల్-ముల్క్ 4) ఎవరూ కాదు
11. తూర్పు ఇండియా వర్తక సంఘంతో సైన్య సహకార ఒప్పందానికి అంగీకరిస్తూ మొదటగా సంతకం చేసిన స్వదేశీ సంస్థానం?
1) అవధ్ 2) తంజావూరు
3) మైసూర్ 4) హైదరాబాద్
12. తెలంగాణ ఎటువంటి సంస్కృతి కలిగినది?
1) దక్కన్ సంస్కృతి 2) వైదిక సంస్కృతి
3) గిరిజన సంస్కృతి 4) మిశ్రమ సంస్కృతి
13. నిజాం (హైదరాబాద్) సంస్థానానికి సంబంధించి కింది వ్యాఖ్యలు పరిశీలించండి.
ఎ. నిజాం రాజ్యాన్ని 1724-1948 మధ్య
అసఫ్జాహీ వంశీకులు పాలించారు
బి. నిజాం సంస్థానంలో తెలంగాణ, మరఠ్వాడా, కన్నడ ప్రాంతాలు అంతర్భాగంగా ఉండేవి
సి. నిజాం సంస్థానంలో ప్రధానంగా తెలుగు, కన్నడ, మరాఠీ, ఉర్దూ భాషలు మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండేవారు
1) ఎ 2) బి 3) సి
4) మూడు సరైన వ్యాఖ్యలే
14. 1857 వరకు హైదరాబాద్ సంస్థానంలో చెలామణిలో ఉన్న ద్రవ్యం?
1) హోలి సిక్కా 2) మొఘల్ సిక్కా
3) రుపయా 4) వరహా
15. నిజాం కాలంలో స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థానాలు ఎన్ని?
1) 5 2) 7 3) 14 4) 18
16. హైదరాబాద్ (నిజాం) సంస్థానంలో ఎన్ని జిల్లాలు ఉండేవి?
1) 10 2) 16 3) 18 4) 12
17. హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం ఎన్ని సుభాలుగా విభజించారు?
1) 10 2) 8 3) 5 4) 12
18. అసఫ్జాహీ పాలకులు ఎవరి కాలం నుంచి నిజాంలుగా పిలవబడ్డారు?
1) రెండో అసఫ్జాహీ పాలకుడు అలీఖాన్ నుంచి
2) ముజఫర్ జంగ్ పాలన నుంచి
3) మూడో అసఫ్జాహీ సికిందర్ జా నుంచి
4) నసీరుద్దౌలా పాలనా కాలంలో
19. అసఫ్జాహీల మొదటి అధికార భాష?
1) ఉర్దూ 2) అరబ్బీ
3) పార్శీ 4) హిందీ
20. అసఫ్జాహీలు ఏ సంవత్సరం నుంచి ఉర్దూను అధికార భాషగా మార్చారు?
1) 1884 2) 1864
3) 1874 4) 1854
21. దక్కనీ చిత్రకళకు ఆద్యుడు ఎవరు?
1) మీర్ అబ్బాసీ 2) మీర్ హషీం
3) మహ్మద్ జమాన్ 4) ఎవరూ కాదు
22. కింది వాటిలో సరైన వ్యాఖ్య/ వ్యాఖ్యలను గుర్తించండి.
ఎ. సర్వాయి పాపన్న తెలంగాణ ముస్లిం పాలకుల నిరంకుశత్వాన్ని ఎదిరించిన తెలంగాణ
తొలి విప్లవ వీరుడు
బి. సర్వాయి పాపన్న వరంగల్ జిల్లా తారికొండ పక్కన లింగంపల్లి గ్రామానికి చెందినవాడు
సి. పాపన్న గౌడ్ (కల్లుగీత) కులానికి చెందినవాడు
1) ఎ 2) బి 3) సి
4) మూడు వ్యాఖ్యలు సరైనవే
23. హైదరాబాద్ (నిజాం) రాజ్య విస్తీర్ణం ఎంత?
1) 80,798 మైళ్లు 2) 72,698 మైళ్లు
3) 82,698 మైళ్లు 4) 62,698 మైళ్లు
24. ఏపీ రాష్ట్రం ఏర్పడక ముందు (1956లో) తెలంగాణ భూభాగంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి?
1) 9 2) 10 3) 8 4) 7
25. దేవదాసీలు చేసే ఏ నృత్యాన్ని సంస్కరించి భరత నాట్యంగా మార్చారు?
1) పేరిణీ 2) రేలాట నృత్యం
3) చుట్టకాముడు నృత్యం 4) సదిర్
26. సరికాని జతను గుర్తించండి.
1) కొల్లాపూర్ సంస్థానం- సురభి వంశం
2) పాల్వంచ సంస్థానం- మాచిరాజు వంశం
3) దోమకొండ సంస్థానం- కామినేని వంశం
4) వనపర్తి సంస్థానం- జనుంపల్లి వంశం
27. మొదటి సాలార్ జంగ్ అసలు పేరు ఏమిటి?
1) మీర్ మహ్మద్ అలీ 2) తురాబ్ అలీఖాన్
3) లాయక్ అలీ 4) నిజాం అలీఖాన్
28. అసఫ్జాహీ వంశీకుల పూర్వీకులు ఏ దేశానికి చెందినవారు?
1) టర్కీ 2) తుర్క్మెనిస్థాన్
3) అఫ్గానిస్థాన్ 4) ఇరాన్
29. నిజాం రాజులు హైదరాబాద్ను ఎన్ని సంవత్సరాలు పాలించారు?
1) 224 2) 324
3) 124 4) 294
30. కింది వాటిలో సరైన వ్యాఖ్య/వ్యాఖ్యలను గుర్తించండి.
ఎ. దక్కనులో తొలిసారి పీర్ల పండుగను
కుతుబ్షాహీలు ప్రారంభించారు
బి. కుతుబ్షాహీలు పరమత సహనం
పాటించారు
సి. కులియత్ కులీ గీతాలను మహ్మద్
కులీ కుతుబ్ షా రచించారు
1) ఎ 2) బి 3) సి
4) పై మూడు వ్యాఖ్యలు సరైనవే
31. కుతుబ్షాహీల కాలంలో అభివృద్ధి చెందిన నాట్య రీతి?
1) కూచిపూడి 2) భరత నాట్యం
3) పేరిణీ 4) ఏదీకాదు
32. అసఫ్జాహీ వంశానికి సంబంధించి కింది వాటిని జతపరచండి.
1. మూల పురుషుడు ఎ. ఖ్వాజా అబిద్
2. రాజ్య స్థాపకుడు బి. మీర్కమ్రుద్దీన్
(నిజాం ఉల్ ముల్క్)
3. రెండో రాజధాని సి. ఔరంగాబాద్
4. మొదటి రాజధాని డి. హైదరాబాద్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
3) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
4) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
33. 1వ నిజాం మీర్ కమ్రుద్దీన్ బిరుదులు, ఇచ్చిన వారిని సరిగా జతపరచండి.
1. నిజాం ఉల్ ముల్క్ ఎ. ఫరూక్ సియర్
2. చిన్ ఖిలిచ్ ఖాన్ బి. ఔరంగజేబు
3. అసఫ్ జా సి. మహ్మద్ షా రంగీలా
4. ఖాన్-ఇ-దురానీ డి. మొదటి బహదూర్ షా
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
4) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
-సత్యప్రకాశ్ ఏకేఆర్ స్టడీసర్కిల్
వికారాబాద్
జవాబులు
1. 1 2.2 3.1 4.3 5.1
6. 2 7.3 8.1 9.4 10.2
11.4 12.4 13.4 14.2 15.3
16.2 17.3 18.1 19.3 20.1
21.2 22.4 23.3 24.1 25.4
26.2 27.2 28.1 29.1 30.4
31.1 32.2 33.1