సిర్పూర్(టీ) : ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలంలోని ఇట్యాల గ్రామంలో గురువారం రాత్రి రెండు రెండు తలల పాములను సిర్పూర్(టీ) ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. సిర్పూర్(టీ) ఫారెస్ట్ రేంజ్ అధికారి పూర్ణచందర్ రావు తెలిపిన వివరాల ప్రకారం…రెండు తలల పామును పట్టుకుని ఒకచోట దాచిన విషయంపై పక్కా సమాచారం మేరకు సిర్పూర్(టీ) రేంజ్ ఆధ్వర్యంలో ఎఫ్ఎస్వో సద్దాం హుస్సేన్ నేతృత్వంతో సిబ్బంది గ్రామంలో తనిఖీలు నిర్వహించింది. ఇద్దరి ఇండ్లలో రెండు రెండు తలల పాములు ఉన్నట్లు గుర్తించి 11 మందిని అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు.
వీరిని కాగజ్నగర్ ఎఫ్డీవో విజయ్కుమార్ ముందు హాజరుపరచి, వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు వివరించారు. విచారణలో సిర్పూర్(టీ) రేంజ్ అధికారి పూర్ణచందర్రావు, డిప్యూటీ ఎఫ్ఆర్వోలు ముసావీర్, ప్రకాశ్ నాయక్, ఎఫ్ఎస్ వో సద్దాం హుస్సేన్, ఎఫ్బీవోలు ప్రభాకర్, గోపాల్, షాహిద్, నరేశ్, అరవింద్లను కాగజ్నగర్ ఎఫ్డీవో విజయ్కుమార్ అభినందించారు.