మీరు ఈ వార్త ఇప్పటికే చదివి ఉంటారు. 2017లో చోటు చేసుకున్న ఓ ఘటన.. మళ్లీ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నాటి వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేశారు.
తమిళనాడులోని మెట్టుపాలయం ఫారెస్టులో ఓ ఏనుగు పిల్ల తన తల్లి నుంచి విడిపోయింది. ఎందుకంటే ఆ ఏనుగు పిల్ల బురద గుంతలో పడిపోయింది. ఈ క్రమంలో ఫారెస్ట్ గార్డ్ పళనిచామి శరత్ కుమార్ ఆ ఏనుగు పిల్లను చూసి చలించిపోయాడు. తక్షణమే ఆ గుంతలో నుంచి ఏనుగు పిల్లను బయటకు తీసి ప్రాణాలతో కాపాడాడు. ఆ తర్వాత బాహుబలి మాదిరి ఏనుగు పిల్లను తన భుజాలపై మోసుకెళ్లి.. తల్లి వద్ద దింపాడు. ఇక ఆ ఏనుగు పిల్ల తమ మందలో కలిసిపోయింది. ఈ ఘటన 2017లో చోటు చేసుకోగా, మళ్లీ ఇప్పుడు వైరల్ అవుతోంది.