శంషాబాద్, డిసెంబర్ 1: శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ ప్రయాణికులపై కొవిడ్ నిఘా కొనసాగుతోంది. ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్ను బుధవారం గవర్నర్ తమిళిసై సందర్శించారు. రాబోయే మరో రెండు నెలల పాటు విస్తృతంగా పనిచేయాలని గవర్నర్ విమానాశ్రయం, వైద్యాధికారులను ఆదేశించారు. కొత్త వేరియంట్ ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే విదేశీ ప్రయాణికులను క్లోజ్ మానిటరింగ్ చేయాలని సూచించారు.