శంషాబాద్, అక్టోబర్ 31: శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు ఒక ప్రయాణికుడి వద్ద రూ.10 లక్షల విలువైన సౌదీ కరెన్సీ రియాల్ను పట్టుకున్నారు. ఆదివారం హైదరాబాద్ నుంచి షార్జా వెళ్తున్న ఆ ప్రయాణికుడు రూ.10 లక్షల విలువైన సౌదీ రియాల్ను అక్రమంగా తరలిస్తుండగా సీఐఎస్ఎఫ్ తనిఖీ చేసి పట్టుకొన్నది. నిందితున్ని కస్టమ్స్ శాఖకు అప్పగించింది.