సిటీబ్యూరో, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : ఈ -శ్రమ్ కార్డు పొందితే అనేక ప్రయోజనాలు ఉన్నాయని లేబర్ కమిషన్ పిలుపునిచ్చింది. ప్రతి ఒక్క కార్మికుడు తన పేరును నమోదు చేసుకోవాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ శ్రమ్ ప్రత్యేక పోర్టల్లో పేర్ల నమోదుకు అసంఘటిత రంగ కార్మికుల నుంచి ఇప్పటికే మంచి స్పందన లభిస్తోంది. ఈ పథకంతో పేర్లు నమోదు చేసుకున్న కార్మికులకు ఎంతో ప్రయోజన చేకూరుతుంది. బంజారాహిల్స్లోని ఎన్బీ నగర్ స్టేడియంలో ఈ శ్రమ్ కార్డ్స్ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో లేబర్ ఆఫీసర్ వేణుగోపాల్, తెలంగాణ స్టేట్ డొమెస్టిక్ వర్కర్స యూనియన్ మాజీ ప్రెసిడెంట్ రేణుక, వైస్ ప్రెసిడెంట్ పావని, నవనీత, సురేఖ రాణి తదితరులు పాల్గొన్నారు.
అర్హతలు ఇవే..