అడ్డగుట్ట, డిసెంబర్ 1 : దశల వారిగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని ప్రసన్న శ్రీనివాస్ అన్నారు. బుధవారం డివిజన్లోని సీ సెక్షన్లో డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సహకారంతో అడ్డగుట్టను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. రానున్న కాలంలో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర గ్రంథాలయం డైరెక్టర్ లింగాని శ్రీనివాస్, జలమండలి ఏఈ స్రవంతి, పారీ ్టశ్రేణులు నక్కమధు, సత్తయ్య గౌడ్, మనోహర్, ఎల్లయ్య, ప్రవీణ్, వడ్లూరి రవి, నర్సింగ్, సుజాత తదితరులు పాల్గొన్నారు.