కొన్ని సందర్భాల్లో కొన్ని ఆహార పదార్థాలు మంచి కంటే కీడే ఎక్కువ చేస్తాయి. ముఖ్యంగా మహిళలు నెలసరి సమయంలో ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే శరీరంలో వేడి, మంట, నొప్పి తదితర సమస్యలు వస్తాయి. ఆ బాధ నుంచి ఊరట పొందేందుకు నొప్పి నివారణ మాత్రలు వేసుకుంటారు. దీనివల్ల దీర్ఘకాలంలో ఇబ్బందులు తప్పవు. కాబట్టి ఆ నాలుగైదు రోజుల్లో ఎక్కువ మోతాదులో ఉప్పు, కాఫీ, మసాలాలు, మాంసం, పుట్టగొడుగులు, పల్లీలు, వంకాయ, సీఫుడ్స్ మొదలైన వాటికి దూరంగా ఉండాలి. తాజా పండ్లు, మెగ్నీషియం పుష్కలంగా ఉండే అల్లం చాయ్, పసుపు, డార్క్ చాక్లెట్స్, పెరుగు, బీన్స్ వంటివి తినాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. ధ్యానం, వ్యాయామం, యోగా ఆపేయకూడదు.