న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్జెట్ విమానాన్ని కరాచీ విమానాశ్రయంలో దించారు. ఇండికేటర్ లైట్లో సమస్యలు తలెత్తడంతో ఆ విమానాన్ని కరాచీకి దారి మళ్లించారు. ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నట్లు స్పైస్జెట్ ప్రతినిధి తెలిపారు. ఎటువంటి ఎమర్జెన్సీ ప్రకటించలేదని ఆ సంస్థ తెలిపింది. ప్రయాణికులను తీసుకువెళ్లేందుకు కరాచీకి మరో విమానాన్ని పంపారు.విమానం రెక్కల భాగంలో ఉన్న ఇంధన ట్యాంక్ నుంచి లీకేజీ జరిగినట్లు అనుమానిస్తున్నారు. అనూహ్య రీతిలో ఫ్యూయల్ ట్యాంక్ ఖాళీ అవుతున్నట్లు గుర్తించామని డీజీసీఏ అధికారులు తెలిపారు. చాలా వేగంగా ఇంధనం తగ్గిన సంకేతాలు కాక్పిట్లో ఉన్న ఫ్యూయల్ డిస్ప్లేలో కనిపించినట్లు వెల్లడించారు. దీని వల్లే విమానాన్ని కరాచీలో ముందు జాగ్రత్తగా ల్యాండ్ చేసినట్లు తెలిపారు. విమానంలో 150 మంది ప్రయాణికులు ఉన్నారు.