న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఆదివారం రాత్రి ఆకాశంలో అద్భుతం జరుగనున్నది. గురుగ్రహం, శని, శుక్రుడు, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు ఒకే సరళరేఖ మీదకు రానున్నాయి. రాత్రి పూట చంద్రుడు, శని , శుక్రుడు, గురు గ్రహాలను ఎలాంటి పరికరాలు లేకున్నా చూడవచ్చు. బైనాక్యులర్లతో చూస్తే ఐదు గ్రహాలూ కనిపిస్తాయి. వీటితో పాటు సిరియస్ అనే మరుగుజ్జు గ్రహం, పల్లాస్ అనే ఆస్టరాయిడ్ కూడా కనిపిస్తాయి. గతేడాది జూలై 19న కూడా ఈ గ్రహాలు ఒకే సరళరేఖపైకి వచ్చాయని శాస్త్రవేత్తలు తెలిపారు.