వౌకేశా: అమెరికా విస్కాన్సిన్ రాష్ట్రంలోని వౌకేశాలో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. క్రిసస్ ముందస్తు వేడుకల సందర్భంగా నగరంలో నిర్వహిస్తున్న పరేడ్పైకి ఒక ఎస్యూవీ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా 40 మందికి పైగా గాయపడ్డారు. పోలీసులు కారుపై కాల్పులు జరపగా, డ్రైవర్ తప్పించుకుపోయాడు. మిల్వాకేకు సమీపంలో అతన్ని అదుపులోకి తీసుకున్నామని, విచారణ చేస్తున్నామని వౌకేశా పోలీసు చీఫ్ దాన్ థాంప్సన్ పేర్కొన్నారు.