హైదరాబాద్, నవంబర్ 25: అంతరిక్ష పరిశోధనల్లో భాగంగా హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుత విజయాన్ని సాధించింది. తొలి ప్రైవేట్ క్రయోజె నిక్ రాకెట్ ఇంజిన్ ‘ధావన్-1’ను విజయవంతంగా పరీక్షించింది. నాగ్పూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ ఇండి యాలో దీన్ని పరీక్షించారు. మేడిన్ ఇండియాలో భాగం గా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ఈ ఇంజిన్.. లిక్విడ్ న్యాచురల్ గ్యాస్, లిక్విడ్ ఆక్సిజన్తో నడవనుంది. 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో అత్యంత సామర్థ్యం ఉన్న మిశ్రమాన్ని ఉపయోగించి దీన్ని తయా రుచేశారు.
రాకెట్ అప్పర్ స్టేజీలో వినియోగానికి ఈ ఇంజిన్ ఉపయోగపడుతుంది. పేలోడ్ సామర్థ్యాన్ని పెంచటంలో కీలకంగా వ్యవహరించనున్నది. 2023లో ప్రయోగించనున్న విక్రమ్-2 ఆర్బిటల్ వాహనానికి ఈ టెక్నాలజీ వాడనున్నట్టు స్కైరూట్ ఏరోస్పేస్ సీఈవో, సహవ్యవస్థాపకుడు పవన్ కుమార్ చందన తెలిపారు. ఇవి ఎక్కువ సామర్థ్యం, తక్కువ ఖర్చుతో కూడి, పర్యావ రణ హితమైనవని వెల్లడించారు. ఇస్రో సెంటర్లలో పరీక్షలు నిర్వహించేందుకు, సాంకేతికతను అందిపుచ్చు కొనేందుకు డిపార్టమెంట్ ఆఫ్ స్పేస్తో సెప్టెంబర్లో ఒప్పందం కుదుర్చుకొన్నట్టు పేర్కొన్నారు.