న్యూఢిల్లీ: విప్రో సంస్థ ఇటీవల ౩౦౦ మంది ఉద్యోగుల్ని తొలగించిన విషయం తెలిసిందే. ఆ ఉద్యోగులు మూన్లైటింగ్కు పాల్పడుతున్నట్లు తెలిసింది. ఒక సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తూ.. అదనపు అవసరాల కోసం మరో సంస్థకు పనిచేయడాన్ని మూన్లైటింగ్ అంటారు. సాధారణంగా ఉదయం పూట ఓ ఉద్యోగం చేస్తూ.. రాత్రి వేళ మరో ఉద్యోగం చేయడమే మూన్లైటింగ్. అయితే మూన్లైటింగ్ ఉద్యోగం చేస్తున్న ౩౦౦ మందిని విప్రో సంస్థ ఇటీవల ఫైర్ చేసింది. మరో కంపెనీకి ఉద్యోగం చేయడం అంటే అది చీటింగ్ చేయడమే అని విప్రో బాస్ రిషద్ ప్రేమ్జీ అన్నారు. విప్రో ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కొందరు ఉద్యోగుల్ని ఇటీవల తొలగించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఇక మేటి టెక్ కంపెనీలు ఐబీఎం, ఇన్ఫోసిస్ కూడా మూన్లైటింగ్ ఉద్యోగులను వ్యతిరేకించింది. ఆ పద్ధతి అనైతికమని తేల్చాయి.
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ.. ఇటీవల మూన్లైంటింగ్ విధానాన్ని స్వాగతించింది. ఉద్యోగులు తమ ప్రతిభ ఆధారంగా మరో ఉద్యోగం కూడా చేసుకోవచ్చు అని తెలిపింది. కానీ ఈ ఐడియాను ఐటీ దిగ్గజ కంపెనీలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. ఓ ప్రాజెక్టుపై పనిచేస్తున్న ఉద్యోగులు ఇతరలతో సంభాషణ జరపవచ్చు కానీ, సీక్రెట్గా కాంపిటీటర్తో కలిసి పనిచేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు రిషద్ ప్రేమ్జీ తెలిపారు. విప్రోలో పని చేస్తూ.. మరో కంపెనీకి కూడా పనిచేయడాన్ని తాము విభేదిస్తామన్నారు