హైదరాబాద్ : తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న గ్రాండ్ ట్రంక్ (GT Express) ఎక్స్ప్రెస్లో ప్రమాదవశాత్తు శనివారం మంటలు చెలరేగాయి. రైలు కిందిభాగంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన ఆర్పీఎఫ్ ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. దీంతో రైలులో ఉన్న ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. పెద్దపల్లి – రాఘవపూర్ మధ్య ఈ ఘటన చోటు చేసుకున్నది. అయితే, మంటలు చెలరేగడానికి మాత్రం కారణాలు తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.