హైదరాబాద్ : రాజేంద్రనగర్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి కారు దగ్ధమైంది. అత్తాపూర్ పీవీ ఎక్స్ప్రెస్వే వద్ద సోమవారం నడుస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అప్రమత్తమైన వెంటనే కారును నిలిపివేయించారు. కారు నడుపుతున్న మహిళతో పాటు పిల్లలను దింపివేశారు. కొద్ది క్షణాల్లో కారుకు మంటలు వ్యాపించి దగ్ధమైంది. అయితే, మంటలకు చెలరేగడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. స్థానికులు వెంటనే అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం తప్పినట్లయింది. మామిడిపల్లి నుంచి హైదరాబాద్లోని ఆసుపత్రికి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.