జిన్నారం : సంగారెడ్డి జిల్లా జిన్నారంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గడ్డపోతారం పారిశ్రామికవాడలోని సరాక లాబొరేటరీస్లో మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు వ్యాపించి.. అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది ఫైర్ ఇంజిన్ను సంఘటనా స్థలానికి తరలించి మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, మంటలు చెలరేగడానికి మాత్రం కారణాలు తెలియరాలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.