న్యూఢిల్లీ : భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ సేవలకు గుర్తింపుగా ఫిఫా మూడు భాగాల వీడియో సిరీస్ను విడుదల చేసింది. ఫిఫా అధికారిక వెబ్సైట్లో ఛెత్రీకి సంబంధించిన సిరీస్ను ‘సునీల్ ఛెత్రీ..కెప్టెన్ ఫాంటాస్టిక్’ పేరిట అందుబాటులో ఉంచినట్టు ఫిఫా వెల్లడించింది.
ఫుట్బాల్ అభిమానులకు క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ గురించి తెలుసునని, అంతర్జాతీయ గోల్స్ నమోదులో మూడో స్థానంలో ఉన్న సునీల్ ఛెత్రీప్రతిభను తెలిపేందుకే ఈ సిరీస్ను అందుబాటులోఉంచినట్టు ఫిఫా ఒక ప్రకటనలో వెల్లడించింది. అత్యధిక అంతర్జాతీయ గోల్స్ చేసిన వారిలో రొనాల్డో117, మెస్సీ 90 గోల్స్తో తొలి రెండు స్థానాల్లో ఉండగా, ఛెత్రీ 84 గోల్స్తో మూడో స్థానంలో ఉన్నాడు. ఐరోపా, దక్షిణ అమెరికా దేశాలకు చెందని ఆటగాడు మూడో స్థానంలో నిలవడం గమనార్హమని ఫిఫా ప్రశంసించింది. 2005లో తొలిసారి భారత్కు ఆడిన సునీల్ ఇప్పటివరకు 131 మ్యాచ్లలో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు.