న్యూఢిల్లీ, జూలై : జొమాటోకు చెందిన లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ ఫీడింగ్ ఇండియా మల్టీ బ్రాండ్ మొబైల్ ఫోన్ రిటైలర్ సంగీతా మొబైల్స్ తో భాగస్వామ్యం చేసుకున్నది. ఫ్రంట్లైన్ వర్కర్లు తోపాటు కరోనా బాధిత కుటుంబాలకు ‘డెయిలీ ఫీడింగ్ ప్రోగ్రామ్’పేరుతో పది లక్షల భోజనాలు అందించనున్నాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులలో ఈ సేవలు అందించనున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఫీడింగ్ ఇండియా 100 సంస్థల సహకారంతో పనిచేస్తున్నది.
‘‘సంగీతా మొబైల్స్తో భాగస్వామ్యం చేసుకుని పది లక్షలకు పైగా భోజనాలను కరోనా ప్రభావిత కుటుంబాలతో సహా ఫ్రంట్లైన్ వర్కర్లకు మా ‘డెయిలీ ఫీడింగ్ ప్రోగ్రామ్’లో భాగంగా అందించనున్నాం. సంగీతా మొబైల్స్ అందించిన తోడ్పాటు ఇప్పుడు మరింత మందిని చేరుకోవడానికి సహాయపడనుంది’’ అని ఫీడింగ్ ఇండియా హెడ్ చైతన్య మాథుర్ అన్నారు.