అమరావతి : కృష్ణా జిల్లా వత్సవాయి మండలం భీమవరం సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. దంపతులు ఇద్దరు కుమార్తెలతో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తుండగా వస్తున్నారు. భీమవరం శివారులో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో సంఘటనా స్థలంలోనే తండ్రీ, కూతురు మృతి చెందారు. భార్య, మరో కూతురు గాయపడ్డారు. వారిని వెంటనే హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు నాగయలంక వాసులుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.