రాయపర్తి/పర్వతగిరి, నవంబర్ 23: పశుపోషణతో రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని తెలంగాణ రాష్ట్ర గోశాలల ఫెడరేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు మహేశ్ అగర్వాల్ అన్నారు. జింకురాంతండాలో మంగళవారం స్థానిక నందీశ్వర గోశాల నేతృత్వంలో పది మంది నిరుపేద రైతు కుటుంబాలకు రెండేసి లేగదూడలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గోశాలల ఫెడరేషన్ రాష్ట్ర కో ఆర్డినేటర్ రోజారాణి అగర్వాల్, నందీశ్వర గోశాల అధ్యక్షుడు లావుడ్యా రవీందర్నాయక్, సర్పంచ్ సుందర్నాయక్, ఎంపీటీసీ స్వేత తదితరులు పాల్గొన్నారు. పర్వతగిరి మండలంలోని మోత్యాతండాలో జగదాంబ గోశాల ఆధ్వర్యంలో పది మంది రైతులకు రెండు చొప్పున 20 లేగదూడలను మహేశ్ అగర్వాల్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో గాడిపెల్లి రాజేశ్వర్రావు, సర్పంచ్ జ్యోతి రవి, కార్యదర్శి పూర్ణచందర్, రైతులు పాల్గొన్నారు.