న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ రోహిణి కోర్టులో మళ్లీ పేలుడు కలకలం సృష్టించింది. గురువారం ఉదయం రోహిణి గేట్ నంబర్ 102లో ఈ ఘటన చోటు చేసుకున్నది. పేలుడులో ఒకరు గాయపడ్డారు. ఒక్కసారిగా వచ్చిన భారీ శబ్దంతో అక్కడున్న వారంతా భయాందోళనకు గురై సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. అనంతరం షార్ట్ సర్క్యూట్ కారణంగా ల్యాప్టాప్లో పేలుడు సంభవించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. అయితే, ముందుస్తు జాగ్రత్తగా రోహిణికోర్టులో తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేశారు. ఘటనపై ఢిల్లీ ప్రత్యేక పోలీస్ బృందం దర్యాప్తు చేస్తున్నది.